నేషనల్ హైవేపై రాస్తారోకో.. జగ్గారెడ్డి అరెస్ట్

TG: ఢిల్లీలో ప్రధాని మోదీ నివాసం వద్ద కాంగ్రెస్ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీయగా, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు నిరసనగా తెలంగాణలో కాంగ్రెస్ శ్రేణులు రోడ్లపైకి వచ్చాయి. సంగారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో అర్ధరాత్రి కార్యకర్తలు పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద నేషనల్ హైవేపై రాస్తారోకో నిర్వహించారు. జగ్గారెడ్డిని అరెస్ట్ చేసి సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్కి తరలించే క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసు వాహనాలను అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారి, కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.


