విధులకు డుమ్మా కొట్టని టీచర్.. అభినందించిన హెచ్ఎం

TG: వరంగల్ జిల్లా నర్సంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆగస్టు నెలలో ఒక్కరోజూ సెలవు పెట్టకుండా 100 శాతం హాజరుతో విధులు నిర్వహించిన బయలాజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు రామకృష్ణను ప్రధానోపాధ్యాయుడు ఐ. రామకృష్ణ అభినందించారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రోత్సాహం అందించారు. ఉపాధ్యాయులు క్రమశిక్షణతో విధులకు హాజరవుతూ విద్యార్థుల విద్యాభివృద్ధికి కృషి చేయాలని ప్రధానోపాధ్యాయుడు సూచించారు. 100 శాతం హాజరు సాధించిన ఉపాధ్యాయుడు రామకృష్ణను ఇతర ఉపాధ్యాయులు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.



