ఉల్లిపాలెం స్కూల్లో విపత్తులపై అవగాహన కార్యక్రమం

బాపట్ల జిల్లా నగరం మండలం ఉల్లిపాలెం జడ్పీహెచ్ హైస్కూల్లో కమ్యూనిటీ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ గురువారం విపత్తులపై అవగాహన కార్యక్రమం నిర్వహించింది. 8,9 తరగతుల విద్యార్థులకు విపత్తు రకాలు, CPR, ఎమర్జెన్సీ రెస్క్యూ పద్ధతులపై తెనాలి ఫైర్ ఆఫీసర్ సుబ్బారావు వివరించారు. ప్రాక్టికల్గా కూడా నేర్పించారు. CRDS సిబ్బంది సురేఖ, రేవతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.





