← Back to news

OTP లు షేర్ చేయొద్దు.. ఖమ్మంలో అవగాహన!

By chandra shekar· 2d ago· Vemsoor, Vemsoor, Khammam
OTP లు షేర్ చేయొద్దు.. ఖమ్మంలో అవగాహన!

ఖమ్మం జిల్లా వేంసూరు పోలీస్ స్టేషన్ ఎదురుగా సైబర్ నేరాల అవగాహన సదస్సు జరిగింది. ఎస్ఐ పల్లెల ప్రదీప్ మాట్లాడుతూ.. అపరిచితుల ఫోన్ కాల్స్ నమ్మొద్దని హెచ్చరించారు. ’’బ్యాంక్ సిబ్బంది అని చెప్పి OTP లు అడిగితే జాగ్రత్త! ఆ వివరాలు ఎవరికీ చెప్పొద్దు. మీ వ్యక్తిగత వివరాలు కూడా పంచుకోవద్దు. మోసపోతే వెంటనే 1930కి ఫిర్యాదు చేయాలి.’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ శ్రీను, సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.

OTP లు షేర్ చేయొద్దు.. ఖమ్మంలో అవగాహన!

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 1h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.