OTP లు షేర్ చేయొద్దు.. ఖమ్మంలో అవగాహన!

ఖమ్మం జిల్లా వేంసూరు పోలీస్ స్టేషన్ ఎదురుగా సైబర్ నేరాల అవగాహన సదస్సు జరిగింది. ఎస్ఐ పల్లెల ప్రదీప్ మాట్లాడుతూ.. అపరిచితుల ఫోన్ కాల్స్ నమ్మొద్దని హెచ్చరించారు. ’’బ్యాంక్ సిబ్బంది అని చెప్పి OTP లు అడిగితే జాగ్రత్త! ఆ వివరాలు ఎవరికీ చెప్పొద్దు. మీ వ్యక్తిగత వివరాలు కూడా పంచుకోవద్దు. మోసపోతే వెంటనే 1930కి ఫిర్యాదు చేయాలి.’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ శ్రీను, సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.




