← Back to news

పేదల కోసం సత్రం ప్రారంభం

By rajaratnam· 4d ago
పేదల కోసం సత్రం ప్రారంభం

భీమావారిపాలెంలోని పేద ప్రజల అవసరాలకు కంబాల రంగయ్య సత్రం అండగా నిలవనుంది. రూ.56 లక్షలతో పునర్నిర్మించిన సత్రాన్ని మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ ప్రారంభించారు. సత్రంలో నాలుగు వసతి గదులు, భోజనాలు ఏర్పాటు చేసుకునేందుకు హాలు అందుబాటులోకి వచ్చాయి. అద్దె ఇళ్లలో నివసించే పేదలు, అవసరమైనవారు ఇక్కడ నిద్రించడంతోపాటు భోజన కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చని సతీష్ తెలిపారు. పేదలకు సత్రం ఉపయోగపడేలా ట్రస్ట్ సభ్యులు అందుబాటులో ఉంటారని చెప్పారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 59m ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.