← Back to news

శ్రీపురం చెరువులో పశుగ్రాస సాగుకు శ్రీకారం..

By PRASANNAKUMAR· 1d ago
శ్రీపురం చెరువులో పశుగ్రాస సాగుకు శ్రీకారం..

అనంతపురం జిల్లా గుత్తి మండలం శ్రీపురంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ గురువారం 25 ఎకరాల్లో పశుగ్రాస సాగును ప్రారంభించారు. సూపర్ ఎల్నినో పరిస్థితుల్లో పశువులకు ఇది ఎంతో ఉపయోగకరమని కలెక్టర్ అన్నారు. జిల్లాలో 297 ఎకరాలకు అనుమతి ఇవ్వగా, 249 ఎకరాల్లో విత్తనాలు చల్లారు. ఎకరానికి 20 కిలోల ఉచిత విత్తనాలు పంపిణీ చేస్తున్నట్లు జిల్లా అధికారి ప్రేమ్ చంద్ తెలిపారు. దీనివల్ల 200 పశువులకు 6 నెలల మేత అందనుంది.

శ్రీపురం చెరువులో పశుగ్రాస సాగుకు శ్రీకారం..

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 37m ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.