శ్రీపురం చెరువులో పశుగ్రాస సాగుకు శ్రీకారం..

అనంతపురం జిల్లా గుత్తి మండలం శ్రీపురంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ గురువారం 25 ఎకరాల్లో పశుగ్రాస సాగును ప్రారంభించారు. సూపర్ ఎల్నినో పరిస్థితుల్లో పశువులకు ఇది ఎంతో ఉపయోగకరమని కలెక్టర్ అన్నారు. జిల్లాలో 297 ఎకరాలకు అనుమతి ఇవ్వగా, 249 ఎకరాల్లో విత్తనాలు చల్లారు. ఎకరానికి 20 కిలోల ఉచిత విత్తనాలు పంపిణీ చేస్తున్నట్లు జిల్లా అధికారి ప్రేమ్ చంద్ తెలిపారు. దీనివల్ల 200 పశువులకు 6 నెలల మేత అందనుంది.




