అమ్మమ్మ కళ..మనవరాలు కొనసాగించిందిలా!
కేరళంకు చెందిన మూఱిక్కల్ పంకజాక్షి ‘నోక్కువిద్య పావకళి’ కళతో ప్రసిద్ధులు. ప్రపంచంలోనే ఇది చాలా అరుదైన బొమ్మలాట కళ. కళాకారులు చిన్న కర్రను ముక్కు, పై పెదవి మధ్య నిలబెట్టి, దాని మీద బొమ్మలను ఉంచి, దారాలతో ఆడిస్తారు. దీని సాయంతో రామాయణం, మహాభారతం కథలు చెప్తారు. పంకజాక్షి చనిపోయే ముందు ఆమె మనవరాలు కే.ఎస్.రంజని ఈ కళ నేర్చుకుంది. ఐదేళ్లపాటు కష్టపడి ప్రాక్టీస్ చేసి నేర్పు సంపాదించింది. ఇప్పుడు ప్రదర్శనలు ఇస్తూ కుటుంబ వారసత్వాన్ని కాపాడుతోంది.



