← Back to news

రైతుల కోసం పాదయాత్ర ప్రకటించిన KTR

By Mahesh· 1d ago· TG

TG: నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్‌కు నీళ్లు రిలీజ్ చేయాలని KTR డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 14లోపు నీటి విడుదలపై క్లియర్ షెడ్యూల్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. లేదంటే వేలాది మంది రైతులతో కలిసి కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. సాగర్‌లో 180 TMCల నీరు ఉన్నప్పటికీ, రైతులకు చుక్క నీరు విడుదల చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. 2003లో రైతుల కోసం KCR చేసిన పాదయాత్ర స్ఫూర్తితోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ రైతు వ్యతిరేక పాలసీలపై పోరాడతామని KTR అన్నారు.

More in TG