నందిపేట్ కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షుడిగా అక్బర్ నియామకం

నందిపేట్ మండల కాంగ్రెస్ ముస్లిం మైనార్టీ అధ్యక్షుడిగా అక్బర్ నియమితులయ్యారు. గురువారం మండల కాంగ్రెస్ అధ్యక్షులు దూడ వెంకటేష్ నియామక పత్రం అందజేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. అక్బర్ తనపై నమ్మకం ఉంచిన అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపి, బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తానని అన్నారు.ఈ సందర్భంగా దూడ వెంకటేష్ మాట్లాడుతూ.. అక్బర్ మైనార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.



