వైఎస్సాఆర్కు ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి ఘన నివాళి

TG: మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్రెడ్డి వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వైఎస్సార్ హయాంలో అమలైన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను నాయకులు గుర్తుచేసుకున్నారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గోపాల్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు సయ్యద్ మినాజ్, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొని వైఎస్సార్కు ఘన నివాళులు అర్పించారు.



