మాజీ మంత్రి రోజాకి పోలీసు నోటీసులు?

YCP నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజాకి తిరుపతి ఈస్ట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 30న విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. దీనిపై స్పందించిన రోజా, కూటమి ప్రభుత్వం పొలిటికల్ రివేంజ్లో భాగంగానే తనపై అక్రమ కేసులు పెట్టిందని విమర్శించారు. జగన్ గారి కుటుంబ మహిళలపై అబద్ధాలు రాసిన పేపర్ను నిరసనగా తగలేస్తే కేసు పెట్టడం ఏంటని మండిపడ్డారు. బెదిరింపులకు బెదిరేది లేదని రోజా స్పష్టం చేశారు.






