అనపర్తి ఆసుపత్రికి కొత్త సూపరింటెండెంట్

AP: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్గా డా. పద్మశ్రీ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు సూపరింటెండెంట్గా పనిచేసిన డాక్టర్ రామగురెడ్డి పదోన్నతిపై రాజమహేంద్రవరం బదిలీ కావడంతో, ఆసుపత్రిలో ఆర్ఎంవోగా విధులు నిర్వహిస్తున్న డా. పద్మశ్రీకి సూపరింటెండెంట్గా బాధ్యతలు అప్పగించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె రామవరంలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆసుపత్రిలో వైద్య సేవలను మరింత మెరుగుపరిచేందుకు కృషి చేస్తానని ఆమె తెలిపారు.



