పెద్ది గద్దె కూల్చివేతపై BRS ధర్నా..!
వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్ నగర్లో ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం కోసం నిర్మించిన గద్దెను కూల్చివేశారు. దీన్ని నిరసిస్తూ BRS శ్రేణులు ధర్నా చేపట్టారు. పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు ఆందోళనలో పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ గద్దె కూల్చివేతపై BRS నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బాధ్యులపై చర్యలు, విగ్రహ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ పరిణామాలు ప్రస్తుత రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి.



