← Back to news

పెద్ది గద్దె కూల్చివేతపై BRS ధర్నా..!

By VIJAY· 13h ago· Narsampet (Ct), Narsampet, Warangal

వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్ నగర్లో ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం కోసం నిర్మించిన గద్దెను కూల్చివేశారు. దీన్ని నిరసిస్తూ BRS శ్రేణులు ధర్నా చేపట్టారు. పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు ఆందోళనలో పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ గద్దె కూల్చివేతపై BRS నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బాధ్యులపై చర్యలు, విగ్రహ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ పరిణామాలు ప్రస్తుత రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 2h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.