మిడిల్ ఈస్ట్ టెన్షన్.. మన జేబుపై ప్రభావం పడుతుందా?

మిడిల్ ఈస్ట్లో అమెరికా–ఇరాన్ మధ్య టెన్షన్ మళ్లీ పెరగడంతో ప్రపంచ మార్కెట్లలో ఆందోళన మొదలైంది. ముఖ్యంగా ఆయిల్ సరఫరాకు కీలమైన హోర్ముజ్ మార్గంలో ఇబ్బందులు పెరగడంతో క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 90 డాలర్లను దాటింది. భారత్ క్రూడ్ ఆయిల్ అవసరాల్లో 90%కి పైగా దిగుమతులపై ఆధారపడుతున్నందున, క్రూడ్ ధరలు ఎక్కువకాలం అధికంగా ఉంటే రవాణా ఖర్చులు, వస్తువుల ధరలు, ద్రవ్యోల్బణంపై ప్రభావం పడొచ్చు. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పు లేకపోయినా.. టెన్షన్ కొనసాగితే భారం మన జేబుపై పడే అవకాశం ఉంది.



