జైలు శిక్ష.. డ్రంక్ అండ్ డ్రైవ్కు భద్రాద్రిలో షాక్!

భద్రాద్రి కొత్తగూడెంలో డ్రంక్ అండ్ డ్రైవ్కు కఠిన శిక్ష పడింది. ట్రాఫిక్ పోలీసులు తనిఖీల్లో ఇద్దరు మద్యం సేవించి వాహనాలు నడిపారు. వారిపై కేసులు నమోదు చేశారు. 2వ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ న్యాయమూర్తి రవికుమార్ విచారణ చేశారు. నిందితులకు రెండు రోజుల జైలు శిక్ష విధించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్హెచ్ఓ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ’’మద్యం తాగి డ్రైవ్ చేస్తే ప్రాణాపాయ ప్రమాదాలు తప్పవు. ఇలాంటి వాళ్లను ఉపేక్షించేది లేదు. తనిఖీలు మరింత విస్తృతం చేస్తామ’’న్నారు.



