ఫండ్స్ పక్కదారి..

ఖమ్మం జిల్లా వేంసూరు మండలం అమ్మపాలెం ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘంలో రూ.1.50 లక్షల ఫండ్స్ పక్కదారి పట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కంప్యూటర్ ఆపరేటర్ నరసింహారావు, స్టాఫ్ అసిస్టెంట్ కనకరాజు ఈ నిధులు దోచేశారని గ్రామస్తులు చెప్తున్నారు. ఫిర్యాదులు రావడంతో జిల్లా సహకార బ్యాంక్ అధికారులు స్పందించి వారిద్దరినీ సస్పెండ్ చేస్తూ ఆర్డర్స్ ఇచ్చారు. తప్పు రుజువైతే ముందుగా ఆ డబ్బును రికవరీ చేసి, ఆపై యాక్షన్ తీసుకోనున్నారు. ఈ ఘటనపై పూర్తి ఎంక్వైరీ జరపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

