← Back to news

ఫండ్స్ పక్కదారి..

By aveen· 26 Aug 2026· అమ్మపాలెం
ఫండ్స్ పక్కదారి..

ఖమ్మం జిల్లా వేంసూరు మండలం అమ్మపాలెం ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘంలో రూ.1.50 లక్షల ఫండ్స్ పక్కదారి పట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కంప్యూటర్ ఆపరేటర్ నరసింహారావు, స్టాఫ్ అసిస్టెంట్ కనకరాజు ఈ నిధులు దోచేశారని గ్రామస్తులు చెప్తున్నారు. ఫిర్యాదులు రావడంతో జిల్లా సహకార బ్యాంక్ అధికారులు స్పందించి వారిద్దరినీ సస్పెండ్ చేస్తూ ఆర్డర్స్ ఇచ్చారు. తప్పు రుజువైతే ముందుగా ఆ డబ్బును రికవరీ చేసి, ఆపై యాక్షన్ తీసుకోనున్నారు. ఈ ఘటనపై పూర్తి ఎంక్వైరీ జరపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

More in Local