రైళ్లలో బోగీలు పెంచండి.. రైల్వే అధికారులకు కీలక విజ్ఞప్తి

TG: రాఖీ పండుగ సందర్భంగా రైళ్లలో ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున అదనపు బోగీలు ఏర్పాటు చేయాలని డివిజనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ సభ్యుడు అనుమాస శ్రీనివాస్ కోరారు. మంచిర్యాల నుంచి సింగరేణి, ఇంటర్సిటీ, రామగిరి, బల్లార్షా–కాజీపేట మధ్య నడిచే రైళ్లలో బోగీల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు డివిజనల్ చీఫ్ మెకానికల్ ఇంజనీర్ బిజయ్ కుమార్ రాత్కు వినతిపత్రం అందజేశారు. రాఖీ పండుగ నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే వారి సంఖ్య అధికంగా ఉండటంతో రైళ్లలో రద్దీ పెరుగుతుందని తెలిపారు.



