2 రోజులుగా వర్షం లోనే- MP చంద్రశేఖర్ ఆజాద్
2 రోజులుగా వర్షంలో తడుస్తూ, స్టూడెంట్స్ కి మద్ధతుగా నిరసన కొనసాగిస్తున్న వీడియోను పంచుకుంటూ భీమ్ ఆర్మీ చీఫ్, MP చంద్రశేఖర్ ఆజాద్ ఎక్స్ వేదికగా సంచలన కామెంట్స్ చేశారు. "వర్షపు బొట్టునైనా భరిస్తాం కానీ, అమాయకులపై జరిగే అన్యాయాన్ని అస్సలు సహించం" అని, అన్యాయం చేసినవారు ఎంతటి శక్తిమంతులైనా, వారి వెనుక ఎంత పెద్ద వ్యవస్థ ఉన్నా సమాధానం చెప్పక తప్పదని హెచ్చరించారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆశయాలే తన పోరాటానికి ప్రధాన బలమని చెబుతూ, "జై భీమ్.. జై భారత్" అంటూ తన ఆందోళనను కొనసాగిస్తున్నారు.


