రూ.16కే బట్టలు.. షాపు దగ్గర జనం చేసిన రచ్చ!
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్లో ఓ బట్టల వ్యాపారి ప్రకటించిన ఫ్లాష్ సేల్ తీవ్ర గందరగోళానికి దారితీసింది. రయీస్ ఆలమ్ అనే వ్యాపారి ఏ క్లాత్ కొన్నా కేవలం రూ.16కే ఇస్తామని ప్రకటించారు. అంతేకాకుండా ఈ ఆఫర్ కేవలం 16 నిమిషాలు మాత్రమే ఉంటుందని చెప్పడంతో భారీగా జనం షాపు వద్దకు పరుగులు తీశారు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తింది. స్థానికులకు ఇబ్బందులు కలగడంతో పోలీసులు వ్యాపారిపై FIR నమోదు చేశారు. వ్యాపారితో పాటు ఇంకొంతమందిపై చర్యలు తీసుకున్నారు.



