కర్నూలులో టెర్రర్ అలర్ట్.. అనుమానితుడు అరెస్ట్!

AP: కర్నూలు జిల్లాలో టెర్రర్ సస్పెక్ట్ అరెస్ట్ కలకలం రేపింది. సికింద్రాబాద్కు చెందిన నూర్ మహమ్మద్ను ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కర్నూలు దగ్గరలోని గొందిపర్లలో ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న అతడిపై కొన్నాళ్లుగా నిఘా పెట్టినట్లు తెలిస్తోంది. అరెస్ట్ తర్వాత స్పెషల్ సెక్యూరిటీతో హైదరాబాద్కు తీసుకెళ్లారు. అతడికి ఎవరెవరితో కాంటాక్ట్స్ ఉన్నాయి, ఏదైనా టెర్రర్ గ్రూప్తో లింక్స్ ఉన్నాయా అనే యాంగిల్లో అధికారులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.



