ఢిల్లీలో సీఎం రేవంత్ను కలిసిన మాధవరెడ్డి

TG: ఢిల్లీలో సీఎం రేవంత్రెడ్డితో వరంగల్ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు కొనసాగుతున్న వేళ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. మంత్రివర్గ విస్తరణలో మాధవరెడ్డికి అవకాశం దక్కుతుందనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. మాధవరెడ్డికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉందన్న చర్చ నియోజకవర్గంలోనూ జోరుగా సాగుతోంది.



