← Back to news

వేంసూరులో సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ!

By aveen· 2d ago
వేంసూరులో సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ!

ఖమ్మం జిల్లా వేంసూరులో సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ ఆకస్మిక తనిఖీలు చేశారు. SIR 2026లో భాగంగా అనామలీస్, నో మ్యాపింగ్ కేసులపై ఆయన దృష్టి పెట్టారు. పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటర్ల వివరాలు, బీఎల్ఓల పరిశీలన చేశారు. అర్హత కలిగిన ఓటర్ల వివరాలను పారదర్శకంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని సూచించారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 1h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.