సీజేపీ కార్యకర్తలపై లాఠీచార్జ్ దారుణం: ప్రియాంకా గాంధీ
సీజేపీ కార్యకర్తలపై లాఠీచార్జ్ దారుణమని కాంగ్రెస్ నేత, ఎంపీ ప్రియాంకాగాంధీ అన్నారు. వారు మన పిల్లలని..వారే దేశ భవిష్యత్తు అని తెలిపారు. ఈ పార్లమెంట్ వారిదని..ఇది ఎవరి వ్యక్తిగత సామ్రాజ్యం కాదని పేర్కొన్నారు. రాహుల్ ఈ సమస్యను చాలా కాలంగా లేవనెత్తుతున్నారని తెలిపారు. మాట్లాడకుండా పిల్లలపై లాఠీచార్జ్ చేయడం ఏమిటని మండిపడ్డారు.


