← Back to news

పర్యావరణ పరిరక్షణ కోసం Run for Nature

By Shankar Soudarpally· 2h ago
పర్యావరణ పరిరక్షణ కోసం Run for Nature

TG: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో MDR ఫౌండేషన్ ఆధ్వర్యంలో “రన్ ఫర్ నేచర్” 3K రన్ ఉత్సాహభరితంగా నిర్వహించారు. ORR బైపాస్‌పై కార్యక్రమానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఊపి 3K రన్‌ను ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛమైన గాలి, పచ్చదనం పెంపొందించడంపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా రన్ నిర్వహించారు. MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాదిరి పృథ్వీరాజ్ నేతృత్వంలో కార్యక్రమం జరిగింది. నాయకులు, ఫౌండేషన్ సభ్యులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.

More in Local

ఎమ్మెల్యే మాధవరెడ్డిని కలిసిన కాంగ్రెస్‌ నాయకులు
Local· 2m ago

ఎమ్మెల్యే మాధవరెడ్డిని కలిసిన కాంగ్రెస్‌ నాయకులు

TG: వరంగల్ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని నల్లబెల్లి గ్రామ కాంగ్రెస్‌ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. నల్లబెల్లి గ్రామ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సహకరించాలని కోరారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, అభివృద్ధి పనులపై ఎమ్మెల్యేతో చర్చించారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.