← Back to news

గద్వాలలో 24 గంటలు కరెంటు కావాలని ధర్నా

By VEMANNA· 3d ago
గద్వాలలో 24 గంటలు కరెంటు కావాలని ధర్నా

జోగులాంబ గద్వాల జిల్లా, గట్టు మండల కేంద్రంలో రైతులు ఆందోళనకు దిగారు. సబ్ స్టేషన్ ఆఫీస్ దగ్గర వ్యవసాయానికి 24 గంటలు కరెంటు కావాలంటూ ధర్నా చేశారు. వారికి సంఘీభావంగా BRS పార్టీ ఇంచార్జ్ బాసు, హనుమంతు నాయుడు పాల్గొన్నారు. AE చెన్నయ్యకు వినతిపత్రం ఇచ్చి, "కొంతకాలంగా 3 ఫేజ్ కరెంటుకు కోతలు పెడుతున్నారు" అని ఫిర్యాదు చేశారు. 24 గంటలు రావాల్సిన కరెంటు 12 గంటలు మాత్రమే వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని, దీని పాలనలో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చిందని అన్నారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 1h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.