గద్వాలలో 24 గంటలు కరెంటు కావాలని ధర్నా

జోగులాంబ గద్వాల జిల్లా, గట్టు మండల కేంద్రంలో రైతులు ఆందోళనకు దిగారు. సబ్ స్టేషన్ ఆఫీస్ దగ్గర వ్యవసాయానికి 24 గంటలు కరెంటు కావాలంటూ ధర్నా చేశారు. వారికి సంఘీభావంగా BRS పార్టీ ఇంచార్జ్ బాసు, హనుమంతు నాయుడు పాల్గొన్నారు. AE చెన్నయ్యకు వినతిపత్రం ఇచ్చి, "కొంతకాలంగా 3 ఫేజ్ కరెంటుకు కోతలు పెడుతున్నారు" అని ఫిర్యాదు చేశారు. 24 గంటలు రావాల్సిన కరెంటు 12 గంటలు మాత్రమే వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని, దీని పాలనలో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చిందని అన్నారు.



