రూ.2 లక్షల బీమా చెక్కు అందజేసిన TGB మేనేజర్

జోగులాంబ గద్వాల జిల్లా, ఆలంపూర్ లోని ఉట్కూర్లో ఇటీవల మరణించిన లక్ష్మీదేవి కుటుంబానికి రూ.2 లక్షల బీమా చెక్కు అందింది. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ నాగరాజ్, ఆ చెక్కును నామినీ నర్సింహకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఎస్.టి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ శేఖర్ రెడ్డి, కౌన్సిలర్లు రామాంజనేయులు, శిరీష పాల్గొన్నారు. ఇది పీఎంజెజెబివై పథకం కింద మంజూరైన బీమా. తక్కువ ప్రీమియంతో ఈ పథకాల్లో చేరితే ఇలాంటి హెల్ప్ వస్తుందని మేనేజర్ చెప్పారు.



