← Back to news

రూ.2 లక్షల బీమా చెక్కు అందజేసిన TGB మేనేజర్

By Prakash· 2d ago· Utkur, Alampur, Jogulamba Gadwal
రూ.2 లక్షల బీమా చెక్కు అందజేసిన TGB మేనేజర్

జోగులాంబ గద్వాల జిల్లా, ఆలంపూర్ లోని ఉట్కూర్‌లో ఇటీవల మరణించిన లక్ష్మీదేవి కుటుంబానికి రూ.2 లక్షల బీమా చెక్కు అందింది. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ నాగరాజ్, ఆ చెక్కును నామినీ నర్సింహకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఎస్.టి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ శేఖర్ రెడ్డి, కౌన్సిలర్లు రామాంజనేయులు, శిరీష పాల్గొన్నారు. ఇది పీఎంజెజెబివై పథకం కింద మంజూరైన బీమా. తక్కువ ప్రీమియంతో ఈ పథకాల్లో చేరితే ఇలాంటి హెల్ప్ వస్తుందని మేనేజర్ చెప్పారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 1h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.