ప్రజల ఇబ్బందులు చూసి సొంత నిధులతో రోడ్డు

TG: రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం చౌలపల్లి గ్రామంలో ప్రజలు, భక్తుల రాకపోకల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రవీందర్ యాదవ్ సొంత నిధులతో మట్టి రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. కోట మైసమ్మ దేవాలయం నుంచి హనుమాన్ దేవాలయం వరకు చేపట్టిన రోడ్డు పనులను గురువారం గ్రామస్థుల సమక్షంలో ప్రారంభించారు. గ్రామ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు తనవంతు సహకారం కొనసాగిస్తానని రవీందర్ యాదవ్ తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.



