గురుకుల విద్యార్థిని మృతిపై ఆందోళన

TG: రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మండలం కమ్మదనం గురుకుల పాఠశాలలో గిరిజన విద్యార్థిని ముడావత్ అశ్విని అనుమానాస్పద మృతిపై గురువారం ఆందోళన చేపట్టారు. LHPS, SFI నాయకులు గురుకుల పాఠశాల వద్ద బైఠాయించి ధర్నా నిర్వహించారు. అశ్విని మృతిపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని, ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ను వెంటనే సస్పెండ్ చేయాలని ఎల్హెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాల్ నాయక్ కోరారు.



