రూ.5.50 కోట్లతో కోటిలింగాల ఆలయ పునర్నిర్మాణం

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కోటిలింగాలలోని చారిత్రక శ్రీ కోటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. పెద్దవాగు, గోదావరి సంగమ ప్రాంతంలోని శాతవాహనుల కోట బురుజుపై పెద్ద బండరాళ్లతో నిర్మించిన ఈ శైవక్షేత్రం వందల ఏళ్లుగా భక్తుల ఆరాధనకు నిలయంగా ఉంది. 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం ఉన్న ఆలయ నిర్మాణాన్ని జేసీబీలతో తొలగించే పనులు చేపట్టారు. సుమారు రూ.5.50 కోట్ల వ్యయంతో ఆలయాన్ని పునర్నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు.





