జార్ఖండ్లో 16 రోజులుగా దీక్ష?

జార్ఖండ్లో JPSC, JSSC నియామక పరీక్షల్లో అక్రమాలపై అభ్యర్థులు చేపట్టిన నిరసనలు 16వ రోజుకు చేరాయి. ప్రభుత్వం జరిపిన సమావేశాలు ఫలించకపోవడంతో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థి నాయకుడు దేవేంద్ర నాథ్ మహతో ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. ఆగస్టు 9న మరోసారి చర్చలు జరుపుతామని ప్రభుత్వం ప్రకటించగా.. ఇది కేవలం రాజకీయ స్వార్థమేనని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.



