శ్రీలంకపై భారత్ జోరు.. 165 పరుగుల భారీ గెలుపు!

గాలే వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. శ్రీలంకను రెండో ఇన్నింగ్స్లో 206 పరుగులకే ఆలౌట్ చేసి 165 పరుగుల తేడాతో గెలుపొందింది. భారత్ తొలి ఇన్నింగ్స్లో 462, రెండో ఇన్నింగ్స్లో 193 పరుగులు చేసింది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 284 పరుగులకు ఆలౌటైంది. ఈ టెస్టులో భారత స్పిన్నర్ మానవ్ సుతార్ కీలక పాత్ర పోషించాడు.




