రంగుల రాజకీయం.. ముస్తాబాద్లో ఉద్రిక్తత

TG: రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ గ్రామపంచాయతీ భవనం రంగుల వివాదం రాజకీయ ఉద్రిక్తతకు దారితీసింది. భవనానికి పార్టీ రంగులు వేస్తున్నారని BJP, కాంగ్రెస్, BRS నాయకులు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. కాంగ్రెస్ నాయకులు పిల్లర్లకు తమ పార్టీ రంగులు వేయడానికి ప్రయత్నించగా, BJP, BRS నేతలు అడ్డుకోవడంతో వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నాయకులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


