నల్ల బ్యాడ్జీలతో పెన్షన్ విద్రోహం! చలో కలెక్టరేట్ విజయం

పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు నల్ల బ్యాడ్జీలతో విద్రోహ దినాన్ని నిర్వహించారు. టీజీఈజేసీ (TGEJAC) పిలుపు మేరకు ఈ ధర్నా జరిగిందని, అది విజయవంతమైందని జిల్లా చైర్మన్ బొంకూరి, శంకర్ తెలిపారు.తెలంగాణ సాధనలో ఉద్యోగులు కీలక పాత్ర పోషించినా, నేడు వారి హక్కులు నిర్లక్ష్యం కావడం బాధాకరమన్నారు. ఇది కేవలం పెన్షన్ సమస్య కాదని, ఉద్యోగుల గౌరవం, భద్రతకు సంబంధించిన ఉద్యమమని చెప్పారు. ప్రభుత్వం స్పందించకపోతే సెప్టెంబర్ 10న హైదరాబాద్ లో మహాధర్నా చేస్తామన్నారు.



