‘విధానసభ ఘేరావ్’లో పాల్గొన్న దేవేంద్ర నాథ్ మహ్తో
జార్ఖండ్ రాజధాని రాంచీలో జేపీఎస్సీ-జేఎస్ఎస్సీ అభ్యర్థుల నిరసన కొనసాగుతోంది. జైపాల్ సింగ్ ముండా స్టేడియం నుంచి కొత్త అసెంబ్లీ భవనం వైపు ‘విధానసభ ఘేరావ్’ మార్చ్ చేస్తున్నారు. విద్యార్థి నాయకుడు దేవేంద్ర నాథ్ మహ్తో మాట్లాడుతూ ‘నేను నిరాహారదీక్షలో ఉన్నా ఇక్కడికి వచ్చాను. వాళ్లు మమ్మల్ని ఆపలేరు’ అని చెప్పారు. 9 రోజులుగా దీక్ష చేస్తున్నానని, ప్రభుత్వం తమ డిమాండ్లను తప్పక అంగీకరించాలని’ అన్నారు.


