ఇది SP, కాంగ్రెస్, BJP ఇష్యూ కాదు- అఖిలేష్ యాదవ్
పార్లమెంట్లో విద్యార్థుల సమస్యలకు మద్దతుగా, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ BJPపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఇది SP, కాంగ్రెస్ లేదా BJPకి సంబంధించిన పొలిటికల్ ఇష్యూ కాదు, దేశంలోని స్టూడెంట్స్ సమస్య" అని స్పష్టం చేశారు. రోడ్లపై ప్రొటెస్ట్ చేస్తున్న స్టూడెంట్స్, ఆడపిల్లలపై పోలీసులు దారుణంగా దాడి చేస్తుంటే సభలో కేంద్రం ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. బయట స్టేట్మెంట్స్ ఇచ్చే ప్రధాని మోదీ, సభలోకి వచ్చి విద్యార్థుల హక్కులపై ఎందుకు సమాధానం చెప్పడం లేదని ఫైర్ అయ్యారు.


