దాములూరులో పోలీసుల పల్లె నిద్ర.. ప్రజలకు కీలక అలర్ట్

AP: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దాములూరులో పోలీసులు నిర్వహించిన ‘పల్లె నిద్ర’ కార్యక్రమంలో ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. సీఐ ఎ.సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సైబర్ మోసాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఎవరితోనూ ఓటీపీలు పంచుకోవద్దని, గుర్తుతెలియని లింకులను క్లిక్ చేయవద్దని సూచించారు. యువత **‘ఈగల్ ఛాలెంజ్’**లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.



