← Back to news

ఎర్రబస్సు కాదు.. ఎయిర్‌బస్సునే తెచ్చాం: రాంమోహన్ నాయుడు

By Mahesh· 1 Aug 2026
ఎర్రబస్సు కాదు.. ఎయిర్‌బస్సునే తెచ్చాం: రాంమోహన్ నాయుడు

AP: భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవం తరువాత జరిగిన సభలో కేంద్ర మంత్రి రాంమోహన్ నాయుడు ఉత్తరాంధ్ర అభివృద్ధిపై మాట్లాడారు. ప్రపంచం మొత్తం ఉత్తరాంధ్ర వైపు చూస్తోందని, 'ఎర్రబస్సు కాదు.. ఎయిర్‌బస్సు తిరిగే ప్రాంతంగా ఉత్తరాంధ్రను తీర్చిదిద్దామని' అన్నారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఉత్తరాంధ్రకు సింహద్వారంలా మారుతుందని, దీని ద్వారా రాష్ట్ర యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలోని విజన్–2047తో రాష్ట్రం ముందుకు వెళ్తుందని రాంమోహన్ నాయుడు తెలిపారు.

More in Politics