ఉత్పత్తి కన్నా ఉద్యోగుల భద్రతే ముఖ్యం: సింగరేణి సీఎండీ

బొగ్గు ఉత్పత్తి కన్నా ఉద్యోగుల భద్రతే ముఖ్యమని సింగరేణి ఛైర్మన్ అండ్ ఎండీ డాక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి చెప్పారు. అదే తమ మొదటి ప్రాధాన్యత అని అన్నారు. హైదరాబాద్ సింగరేణి భవన్లో గురువారం జరిగిన 50వ త్రైపాక్షిక భద్రతా సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ప్రమాద రహిత మైనింగ్ కోసం అందుబాటులో ఉన్న ఆధునిక టెక్నాలజీని వాడాలని, పొరపాట్లు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కార్మిక సంఘాల సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు.





