420 అడుగుల భారీ ఫ్లెక్సీతో బీఆర్ఎస్ నిరసన
TG: హనుమకొండ జిల్లా పరకాలలో కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ నిరసన నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నిరసన ర్యాలీ ప్రారంభించారు. అంబేద్కర్ సెంటర్ నుంచి బస్టాండ్ కూడలి వరకు 420 అడుగుల భారీ ఫ్లెక్సీతో ర్యాలీ చేపట్టారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలను ప్రజలకు గుర్తుచేస్తూ ఇంటింటికీ బాకీ కార్డులను పంపిణీ చేశారు. హామీల అమలులో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు.



