← Back to news

రాహుల్ కేసుపై మణుగూరులో యూత్ కాంగ్రెస్ భారీ నిరసన!

By Rammurthy· 2d ago
రాహుల్ కేసుపై మణుగూరులో యూత్ కాంగ్రెస్ భారీ నిరసన!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు హెడ్‌క్వార్టర్స్‌లో యూత్ కాంగ్రెస్ భారీ నిరసన ర్యాలీ చేసింది. చీకటి కార్తీక్ ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన నిర్వహించారు. హల్ద్వానీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభ వేదికను బీజేపీ మతోన్మాదులు గంగాజలంతో "శుద్ధీకరణ" చేశారు. రాహుల్ గాంధీ దాన్ని దళితుల అవమానంగా ఖండించారు. ఆందోళనగా ఆయనపై రివర్స్ కేసు పెట్టడం జరిగింది! దీన్ని నిరసిస్తూ యువజన కాంగ్రెస్ అంబెడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నినాదాలు చేసింది. "రాహుల్ పై కేసులు రద్దు చేయాలి" అని డిమాండ్ చేశారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 1h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.