87 ఏళ్ల వయసు.. ఆరేళ్లుగా అందని కుటుంబ పింఛన్

గుంటూరు జిల్లాకు చెందిన రిటైర్డ్ ఎస్టీఓ ఎం.డి. అన్వర్ఉల్లా బేగ్ భార్య రహమతున్నిసా బేగంకు ఇప్పుడు 87 ఏళ్లు. 19 ఏళ్లుగా తనకు రావాల్సిన కుటుంబ పింఛన్ బకాయిల కోసం ఆరేళ్ల నుంచి అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అయినా సమస్య పరిష్కారం కావడం లేదు. 2020 ఫిబ్రవరిలో మొదటిసారి స్పందన కార్యక్రమంలో అధికారులకు తన సమస్య విన్నవించారు. నేటికీ ఆమె సమస్యకు పరిష్కారం రాలేదు. దీంతో మరోసారి గుంటూరు జిల్లా కలెక్టర్ను కలిసి తన సమస్య వివరించేందుకు వచ్చారు.



