నంది మేడారంలో క్రీడా సందడి.. జోనల్ కు షార్ట్లిస్ట్!

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం సాంఘిక బాలికల గురుకుల పాఠశాలలో గురువారం మండల స్థాయి క్రీడలు ఘనంగా ముగిశాయి. కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్, అథ్లెటిక్స్లో పోటీలు జరిగాయి. మండల విద్యా వనరుల అధికారి పి. ప్రభాకర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను పెద్దపల్లి జోనల్ స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. జిల్లా క్రీడల కార్యదర్శి లక్ష్మణ్, సర్పంచ్ వీరపాలు, ప్రిన్సిపాల్ విజయ, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.



