మంత్రిపాలెం స్కూల్లో విపత్తులపై అవగాహన-లైఫ్ సేవింగ్ టిప్స్!

బాపట్ల జిల్లా నగరం మండలం మంత్రిపాలెం హైస్కూల్లో CRDS స్వచ్ఛంద సంస్థ గురువారం విపత్తులపై అవగాహన సెషన్ నిర్వహించింది. తెనాలి ఫైర్ ఆఫీసర్ సుబ్బారావు విద్యార్థులకు నీట మునిగినా, కరెంట్ షాక్ వచ్చినా, ఎవరైనా గాయపడినా ఎమర్జెన్సీలో ఎలా రెస్క్యూ చేయాలో ప్రాక్టికల్గా నేర్పించారు. CRDS సిబ్బంది సురేఖ, రేవతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.





