← Back to news

జాహ్నవి మృతిపై విచారణ కమిటీ

By MD ALI· 4d ago
జాహ్నవి మృతిపై విచారణ కమిటీ

AP: పోలవరం జిల్లా కూనవరం మండలం కోతులగుట్ట గురుకుల పాఠశాలలో ఏడో తరగతి స్టూడెంట్ తెల్లం జాహ్నవి మృతి ఘటనపై సమగ్ర విచారణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు చింతూరు ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్ తెలిపారు. ఐటీడీఏ ఏపీవో కన్వీనర్‌గా ట్రైబల్ వెల్ఫేర్ డీడీ, డీఎంఅండ్ హెచ్ఓ, డీసీహెచ్ఎస్ సభ్యులుగా కమిటీని నియమించామని పీవో పేర్కొన్నారు. కమిటీ సభ్యులు పాఠశాల, హాస్టల్ సిబ్బంది, ఆసుపత్రి సిబ్బంది, విద్యార్థులను విచారించడంతో పాటు రికార్డులు, వాంగ్మూలాలను పరిశీలించి ఏడురోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని ఆర్డర్ ఇచ్చారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 1h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.