జాహ్నవి మృతిపై విచారణ కమిటీ

AP: పోలవరం జిల్లా కూనవరం మండలం కోతులగుట్ట గురుకుల పాఠశాలలో ఏడో తరగతి స్టూడెంట్ తెల్లం జాహ్నవి మృతి ఘటనపై సమగ్ర విచారణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు చింతూరు ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్ తెలిపారు. ఐటీడీఏ ఏపీవో కన్వీనర్గా ట్రైబల్ వెల్ఫేర్ డీడీ, డీఎంఅండ్ హెచ్ఓ, డీసీహెచ్ఎస్ సభ్యులుగా కమిటీని నియమించామని పీవో పేర్కొన్నారు. కమిటీ సభ్యులు పాఠశాల, హాస్టల్ సిబ్బంది, ఆసుపత్రి సిబ్బంది, విద్యార్థులను విచారించడంతో పాటు రికార్డులు, వాంగ్మూలాలను పరిశీలించి ఏడురోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని ఆర్డర్ ఇచ్చారు.



