ఖర్గేను అవమానించిన వారిపై పోలీసులకు ఫిర్యాదు

ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేపై హల్ద్వానీలో జరిగిన అవమానాన్ని నిరసిస్తూ మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ ఎస్సీ సేల్ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. బాధ్యులపై వెంటనే ఎస్ఐఆర్ నమోదు చేయాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం అధ్యక్షులు తిప్పర్తి శ్రీధర్ డిమాండ్ చేశారు. దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడాలని, రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు ప్రతిఒక్కరూ పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.



