← Back to news

పనులు చేయించుకున్నారు, బిల్లులు చెల్లించడం లేదు

By K naga Suresh· 3d ago· కాకినాడ జిల్లా

AP: కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన పార్టీకి చెందిన కాంట్రాక్టర్‌ సురవరపు సత్తిరాజు పురపాలక అధికారుల తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. గత 25 ఏళ్లుగా పురపాలికలో కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నానని తెలిపారు. వైసీపీ హయాంలో వైఎస్సార్‌ గార్డెన్స్‌లో రూ.7 లక్షలతో రోడ్డు నిర్మించానని, ఆ పనికి సంబంధించిన బిల్లుల కోసం ఇంజినీరింగ్‌ అధికారులు ఎంబుక్‌లు నమోదు చేసుకున్నా చెల్లింపులు జరగలేదని ఆరోపించారు. ఈ అంశంపై కోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 1h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.