← Back to news

కల్వకుర్తిలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

By Srinivas· 1d ago
కల్వకుర్తిలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

TG: నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ఎల్‌ఐసీ బ్రాంచ్‌ కార్యాలయంలో సంస్థ 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. పట్టణంలోని 13 పాఠశాలలకు చెందిన విద్యార్థులు పోటీల్లో పాల్గొని వివిధ అంశాలపై వ్యాసాలు రాశారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, రచనా నైపుణ్యాలను ప్రోత్సహించేలా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఎల్‌ఐసీ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో బ్రాంచ్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌ కుమార్‌, లక్ష్మణాచారి, వినయ్‌ కుమార్‌, ఎల్‌ఐసీ ఉద్యోగులు పాల్గొన్నారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 5h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.