రహదారిపై చేరిన వరద.. నిలిచిన రాకపోకలు

AP: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పోలవరం జిల్లాలో గోదావరి, శబరి నదుల్లో ప్రవాహం పెరిగింది. దీంతో వాగులు పొంగి వరదనీరు రహదారులపై ప్రవహిస్తున్నాయి. పోలవరం జిల్లా చింతూరు మండలం సోకిలేరు వాగు పొంగి వరదనీరు రహదారిపై చేరడంతో చింతూరు, వర రామచంద్రపురం మండలాల నడుమ రాకపోకలు నిలిచిపోయాయి. దీంతోపాటు చింతూరు మండలంలోని 11 గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోవడంతో గిరిజనులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.



