AI వల్ల భారత ITకి మళ్లీ మంచి రోజులు వస్తాయా?

AI వల్ల భారత IT కంపెనీల జాబ్లు, ఆదాయం తగ్గిపోతాయనే భయాల మధ్య.. ఇప్పుడు సీన్ మారొచ్చన్న అంచనాలు వస్తున్నాయి. ఆనంద్ రాఠీ రిపోర్ట్ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా AIపై ఖర్చు కేవలం మౌలిక సదుపాయాల కోసం కాకుండా.. కంపెనీలు నేరుగా AIని వాడుకునే దిశగా మారుతోంది. దీంతో AIని కంపెనీల్లో అమలు చేయడం, డేటాను సిద్ధం చేయడం, కొత్త సేవలు రూపొందించడం వంటి పనులకు భారత IT కంపెనీలకు మరిన్ని చాన్స్లు రావచ్చని రిపోర్ట్ చెబుతోంది. ఈ మార్పుతో 2027 నుంచి భారత IT రంగానికి మంచి గ్రోత్ వచ్చే అవకాశం ఉందట.



