← Back to news

మస్టర్లు వేయలేదంటూ కూలీల ఆందోళన

By PAKIRAYYA· 4d ago· Kaligiri, Kaligiri, Sri Potti Sriramulu Nellore

నెల్లూరు జిల్లా కలిగిరి మండలం నర్సారెడ్డి పాలెంలోని ఉపాధి కూలీలు ఆందోళన చెందుతున్నారు. పనిచేస్తున్నప్పటికీ మాస్టర్లు వేయడం లేదని అంటున్నారు. రాజకీయ ఉద్దేశంతో కూలీలను తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఫీల్డ్ అసిస్టెంట్ ఎవరో తెలియక తికమకి పడిపోతున్నామని చెబుతున్నారు. రోజుకొకరు వచ్చి అటెండెన్స్ తీసుకోవడంతో ఎప్పుడు వస్తారో తెలియక కందరగోళంగా ఉందని అంటున్నారు. పై అధికారులు స్పందించి చర్యలు తీసుకొని కూలీలకు న్యాయం జరిగేలా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 1h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.