మస్టర్లు వేయలేదంటూ కూలీల ఆందోళన
నెల్లూరు జిల్లా కలిగిరి మండలం నర్సారెడ్డి పాలెంలోని ఉపాధి కూలీలు ఆందోళన చెందుతున్నారు. పనిచేస్తున్నప్పటికీ మాస్టర్లు వేయడం లేదని అంటున్నారు. రాజకీయ ఉద్దేశంతో కూలీలను తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఫీల్డ్ అసిస్టెంట్ ఎవరో తెలియక తికమకి పడిపోతున్నామని చెబుతున్నారు. రోజుకొకరు వచ్చి అటెండెన్స్ తీసుకోవడంతో ఎప్పుడు వస్తారో తెలియక కందరగోళంగా ఉందని అంటున్నారు. పై అధికారులు స్పందించి చర్యలు తీసుకొని కూలీలకు న్యాయం జరిగేలా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.



